తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 […]Read More
Tags :telanganacm
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా ఆయన సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో ఛార్జిషీట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్-2 […]Read More
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు. ప్రజా పాలన – ప్రజా […]Read More
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర సైనికుల పునరావాసం, వారి కుటుంబాల సంక్షేమం, పునర్నివాసం వంటి కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే..మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More
ఈ నెల 9 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7, 8, […]Read More
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More
