ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More
Tags :YSRCP
తెగించిన తెలుగు తమ్ముళ్లు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్లిప్పర్ షాట్ రిప్లయ్..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కొంత మంది ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూతురు వరస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సదరు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ తెలుగు తమ్ముళ్లకు స్లిప్పర్ షాట్ అంటూ వైసీపీ సానుభూతి పరులు.. కార్యకర్తలు.. నెటిజన్లు ఆ రిప్లయ్ ను షేర్ చేస్తూ […]Read More
అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి […]Read More
మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!
ఏపీ మాజీ మంత్రి…ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. కోడాలి నాని ఇటీవల హార్ట్ ఆటాక్ రావడంతో నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు.ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తాజాగా వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కోడాలి నాని త్వరలో డిశ్చార్జ్ అవుతారని వైద్యులు పేర్కొన్నారు.Read More
సింగిడి న్యూస్ – విజయవాడ ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత..గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోషాక్ తగిలింది. తమకు చెందిన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెల్సిందే.ఈ కేసులో న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న రిమాండ్ ను మళ్లీ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.తాజాగా విచారించిన విజయవాడ AJFCM […]Read More
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు.. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో మాజీ మంత్రి కొడాలి నాని చేరారు.. అతనికి వైద్యులు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారణ చేశారు.. సాధ్యమైనంత త్వరగా స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. సర్జరీ విషయంలో […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ స్పందిస్తూ హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉప ముఖ్యమంత్రి పవన్కు లేదు.. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు కూడా […]Read More
గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈసందర్భంగా జగన్ నాని ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు.. ఆధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నానికి గుండె సంబధిత సమస్యలున్నాయని ఏఐజీ వైద్యులు […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత కోడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి.. గుడివాడ మాజీ శాసన సభ్యులు కోడాలి నానికి గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితుల నుండి మీడియాకు సమాచారం వచ్చింది.Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల […]Read More