తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More
Tags :telanganacm
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం.. నేను రేవంత్ రెడ్డి సీఎం […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించారు.. “స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన “ఆటోమోటివ్ డిపార్ట్మెంట్”ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్లోని […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు.. తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.. తాజాగా […]Read More
తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకుందని సీఎం చెప్పారు.దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం విద్యా […]Read More
అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన […]Read More
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి… బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.. తెలంగాణ భవన్ లో నిన్న గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలైన కానీ మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు పట్టపగలు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావడంలేదు.. ఉదయం ఒక అత్యాచారం సంఘటన జరుగుతుంది.. మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది.. ఇంటికి వచ్చి టీవీ పెడితే ఒకటి రెండు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము . గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి […]Read More
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఙతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నారు. సీఎంను కలిసినవారిలో సీనియర్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మందుల సామేల్ , కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య ఇతర ప్రజాప్రతినిధులు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈరోజు సాయంత్రం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ కానున్నది.. ఈ భేటీ లో తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సూచన సలహాలపై… ఇటీవల టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్,బాక్సర్ నిఖత్ జరీన్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై చర్చించనున్నారు.. అంతే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు […]Read More
