హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More
Tags :telangana governament
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరోకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ…నూతన పీసీసీ అధ్యక్ష నియామకాల గురించి చర్చించడానికి వెళ్లనున్నారు అని గాంధీ భవన్ వర్గాల ఇన్నర్ టాక్.. అదే విధంగా ఈ నెల 22 తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు కూడా సమాచారం..Read More
గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More
తెలంగాణ సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా స్కూళ్లల్లో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది..Read More
తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.Read More
ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు అంక్షితలు
తన నియోజకవర్గమైన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయకపోతే వాటి గడవు ముగిస్తే ఏమి చేస్తారని ..తగిన వివరాలను అందజేయాలని అంక్షితలు వేస్తూ విచారణను బుధవారం రోజుకు వాయిదా వేసింది..Read More
కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ […]Read More
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె.. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు . తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.Read More