Tags :telangana brs

Slider Telangana Videos

35మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం -BRS MLA

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More

Slider Telangana

తెలంగాణలో గురుకులాలను ఎత్తేస్తారా..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను.. ప్రధాన మంత్రి నరేందర్ మోడీ… రేపు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాము. రాష్ట్రంలో […]Read More

Slider Telangana

కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More

Slider Telangana Videos

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More

Slider Telangana

ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More

Slider Telangana

MLC కవితకు షాక్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More

Slider Telangana

కోమటిరెడ్డి వెంకట రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అమెరికాకు వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ నిందితులను కలవడానికి..నా దగ్గర రుజువులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది.ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది […]Read More

Slider Telangana

ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు ఆజన్మ తెలంగాణ వాది

‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి […]Read More

Slider Telangana

Mp ఎన్నికల ఫలితాలకు ముందు BRS కి గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్‌-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More

Slider Telangana Videos

మంత్రి జూపల్లికి శ్రీధర్ రెడ్డి తండ్రి సవాల్-స్వీకరిస్తారా..?

ఇటీవల హత్యకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అత్యంత దారుణంగా హాత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే శ్రీధర్ రెడ్డి తండ్రి మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు మీద మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా పేరు మీదున్న 30 ఎకరాలు రాసిస్తా.. నిరుపించలేక పోతే జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని బహిరంగ సవాల్ […]Read More