ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పాలనలో రాష్ట్రానికి బీపీసీఎల్ టో పాటుగా మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అయితే డెబ్భై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు మంత్రిని కోరారు.. దీనికి మంత్రి భరత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానమిస్తూ “‘నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే […]Read More
Tags :singidi news
మాజీ మంత్రి … మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. తీరా నేను కాంగ్రెస్ లోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి మారారని మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మోసానికి ప్రతిరూపం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ […]Read More
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంతో మాజీ మంత్రి… ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారని బీఆర్ఎస్ తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ కు అధికార టీకాంగ్రెస్ కౌంటరిచ్చింది. ‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లెమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా? ఉమ్మడి ఏపీ లో హోం మంత్రిని చేసినందుకా? కష్టకాలంలో కాంగ్రెస్ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా?అని ప్రశ్నించింది.. నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా’ […]Read More
ఎంఎస్ ధోనీ ఎవరికి అయిన అభిమాన ఆటగాడు అవ్వడం సహజం. కానీ లెజండరీ ఆటగాడు.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి ఓ ఫెవరేట్ బౌలర్ ఉన్నారు.. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ ని టీమ్ ఇండియా జట్టులో మీ ఫెవరేట్ బౌలర్ ఎవరు అని అడిగారు.. దీనికి సమాధానంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ టీమ్ ఇండియా లో బ్యాటర్లు చాలా మంది ఉన్నారు.. వాళ్లలో ఎవరు ఫెవరేట్ బ్యాటర్ అంటే […]Read More
ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ తన గొప్ప మనసును చాటుకున్నారు.. వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు అండగా నిలిచారు… ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాగా ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య ఇప్పటికి 250కి చేరింది.Read More
కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఓ నిర్మాతతో గొడవపడినట్లు ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. మృణల్ మాట్లాడుతూ “నేను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డాను . ఈ చిత్రానికి సంబందించిన కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి […]Read More
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరిచేత హ్యాట్సాఫ్ అన్పించుకున్నారు.. రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన పిఠాపురంలో వృద్ధురాలైన చంద్రలేఖ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన తన ఆవేదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు యత్నిస్తున్నారని చంద్రలేఖ సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ ఆర్డీవో స్వయంగా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అసెంబ్లీలో మాట్లాడుతూ “పార్టీ మారిన వారు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీ కి వచ్చారు. పదేండ్లు పదవులను అనుభవించారు. అధికారంలో ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లారు అని “మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిను ఉద్దేశిస్తూ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చారు అని భట్టి అన్న అన్నారు. […]Read More
