ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ సిద్దమవుతోంది. ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్లకు జట్లను ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్ఇండియా ఆడే చివరి వన్డే సిరీస్ కూడా ఇంగ్లండ్తోనే. ఈ క్రమంలో ఫామ్ను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లండ్తో […]Read More
Tags :rohith sharma
బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. […]Read More
ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.Read More
టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. […]Read More
కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచారు. న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. […]Read More
టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More
కివీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ తడబాటుపడుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యారు. యాబై ఆరు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ (30),విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచారు. క్రీజ్ లో జైశ్వాల్ (26),రిషబ్ పంత్ (4)పరుగులతో ఉన్నారు. ఇండియా ఇంకా203పరుగులు వెనకబడి […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగుళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.. రోహిత్ మాట్లాడుతూ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. […]Read More
బెంగుళూరు వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్ మీటర్ చెక్ చేసి వెలుతురులేమితో నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు వెళ్లారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెలుతురు బాగానే ఉంది కదా అని ఆకాశానికేసి చూపిస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రోహిత్కు కోహ్లీ […]Read More