Tags :REVANTH REDDY

Slider Telangana

రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ

రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి నారాయణ లేఖ

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల అనే అమ్మాయి అమెరికా అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అక్కడ ఆసుపత్రిలో ఉందని ఆ లేఖలో నారాయణ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెన్నెలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు […]Read More

Slider Telangana Top News Of Today

CMRF పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

ఆర్థికంగా వెనకబడిన వారికీ ఆసుపత్రి విషయంలో అండగా ఉండే పథకం సీఎంఆర్ఎఫ్.. ఇలాంటి పథకం గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై ఈ పథకం గురించి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులను తీసుకునేవిధంగా చర్యలను చేపట్టింది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను  సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను […]Read More

Slider Telangana Top News Of Today

2లక్షల రుణమాఫీపై రేవంత్ రెడ్డి కెలక ప్రకటన

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More

Slider Telangana Top News Of Today

రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాల గురించి అధికార కాంగ్రెస్ చీఫ్.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ రుణమాఫీ గురించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి రెండు రోజుల్లో […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ స్వప్నికుడు జయశంకర్

తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న  శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  జయశంకర్ సారూను స్మరించుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా […]Read More

Slider Telangana

మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Read More

Slider Telangana

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More

Slider Telangana

బీసీ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More

Slider Telangana

తెలంగాణలో భారీగా కలెక్టర్లు బదిలీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More