Tags :narender modi

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు ఏమోషనల్ వీడియో

ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More

Andhra Pradesh Slider

డిప్యూటీ సీఎంగా జనసేనాని

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న  ఆదివారం […]Read More

National Slider Telangana

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More

Slider Telangana Videos

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More

National Slider Telangana

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుభాకాంక్షలు

తెలంగాణ నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు గంగపురం కిషన్ రెడ్డి గారు (సికింద్రాబాద్, MP) కేంద్ర మంత్రి, మరియు బండి సంజయ్ కుమార్ గారు (కరీంనగర్,MP) కేంద్ర సహాయమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా […]Read More

National Slider Videos

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More

National Slider Telangana

ఈటలకు బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More

Slider Telangana

కేంద్ర మంత్రులుగా బండి సంజయ్,కిషన్ రెడ్డి

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More

National Slider Videos

మోదీ కాళ్లను మొక్కబోయిన నితీష్ కుమార్-వీడియో

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి  సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More

Slider Telangana

కవిత కస్టడీ పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో  జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్‌ 21కి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుజైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.Read More