ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More
Tags :nara lokesh
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన మంత్రివర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత గౌరవం తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. జనసేనాని ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. మరోవైపు అటు టీడీపీకి […]Read More
ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More
ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి […]Read More
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో 11ఎమ్మెల్యే..4ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఆ పార్టీ నేత .మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఆ చట్టంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ‘ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More
ఈరోజు విడుదలవుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 162స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖాయమైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. జూన్ తొమ్మిదో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది.Read More
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు వచ్చాయి.. మరోవైపు షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.Read More
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More