Tags :Kinjarapu Ram Mohan Naidu

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు సహకరించండి.

తెలంగాణ రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్టు తెలిపారు.తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Apలో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More