Tags :film news

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. నిన్న గురువారం కార్డియాక్ అరెస్ట్ కు గురి అయ్యారు గాయత్రి. దీంతో నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమార్తె.. ఒక కుమారుడు ఉన్నారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు మాస్ కౌంటరిచ్చిన రవితేజ

హీరోయిన్ సమంత పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. సినీ రాజకీయ మేధావి వర్గంతో పాటు సామాన్యులు సైతం ముక్తకంఠంతో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఘాటుగా స్పందించారు. ” ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచాతి నీచమైన ఆరోపణలు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖను వదిలేది లేదు- హీరో అఖిల్

తమ కుటుంబం గురించి నిరాధార.. అసత్య ఆరోపణలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అక్కినేని వారసుడు.. యువహీరో అఖిల్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఎక్స్ లో ” మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం.. హాస్యాస్పదం.. అసభ్యకరం.. జుగుప్సాకరం.. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరిచిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె అలా వ్యాఖ్యానించారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు.. క్షమించరానిది.. అమాయకులపై సిగ్గులేకుండా దాడి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కోలుకున్న రవితేజ

ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న మాస్ మహారాజ్ … స్టార్ హీరో రవితేజ కోలుకున్నారు. దసరా తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖున సెట్స్ లోకి మాస్ మహారాజ్ ఎంట్రీవ్వనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చిత్రీకరణలో మాస్ మహారాజ్ పాల్గోంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆస్పత్రి నుండి రజినీకాంత్ డిశ్చార్జ్

నాలుగు రోజుల కిందట తీవ్రమైన కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నిన్న గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కడుపులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వైద్యులు స్టంట్ ను అమర్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. సూపర్ స్టార్ నటించిన వేట్టయాన్ ఈ నెల పదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్ములేపుతుంది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఓ స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ఆమె ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మంత్రి సాటి మహిళ వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించడం బాధాకరం.. ఇలాంటి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం ఓ మహిళగా నాకే అసహ్యమేస్తుంది. తాను ఓ మహిళ అనే సంగతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు అక్కినేని కుటుంబం లీగల్ నోటీసులు

తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని  నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని  నాగార్జున స్పష్టం చేశారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కు బెయిల్..?

సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గేమ్ ఛేంజర్ గురించి బిగ్ న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా .. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి,శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ దుమ్ములేపుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ ను సంగీత దర్శకుడు థమన్ ఓ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ ..?

సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళనాడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగానే సూపర్ స్టార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు.. దానికి సంబంధించిన చికిత్స అందజేయనున్నారు.Read More