తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More
Tags :farmers
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More
ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది. కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.Read More
రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణ పేరిట తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి లు ఈ రోజు మాట్లాడారు. మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More
దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.Read More