Tags :ex minister

Andhra Pradesh Slider

బాబు పై అంబటి రాంబాబు ఆగ్రహం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచడానికి మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన జీవో ను సవరించాలి…, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే […]Read More

Slider Telangana

మల్లారెడ్డికి భారీ షాక్

మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం […]Read More

Andhra Pradesh Editorial Slider

రోజా పని అయిపోయిందా…?

రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More

Slider Telangana

మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు […]Read More

Andhra Pradesh Slider

కాంగ్రెస్ లో చేరిన కేకే

తెలంగాణ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.Read More

Andhra Pradesh Slider

అమరావతి కోసం బాబు కోట్ల ఖర్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం నాడు ముఖ్యమంత్రిగా నేటి సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తమ ప్రభుత్వం తీర్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతిపై సీఎంగా ఉన్న బాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ‘జగన్పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అసలు అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు? సంపద సృష్టించి ఎవరికిస్తారు? పేదలకు ఇస్తారా, మీ వారికే […]Read More

Slider Telangana Top News Of Today Videos

కాంగ్రెస్ ప్రభుత్వానికి జగదీశ్ రెడ్డి కౌంటర్

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో అయన మీడియా తో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు, అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే […]Read More

Andhra Pradesh Slider

వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More

Slider Telangana

పార్టీ మార్పు పై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం .. గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ […]Read More

Slider Telangana

TDPలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి-క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను […]Read More