Tags :cm revanth reddy

Slider Telangana

ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More

Slider Telangana

రూ.500లు బోనస్ ఇవ్వాల్సిందే

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు..ఈ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హారీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిశారు.మాజీ మంత్రి హారీష్ రావు తోపంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన […]Read More

Slider Telangana

హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్.

తెలంగాణలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గోండ జిల్లాల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నరు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు.ఒక్క హామీ కూడా అమలు కాలేదు.హామీలను అమలు […]Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో మాజీ మంత్రి హారీష్ రావు పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More

Slider Telangana

రైతులు పండించిన పంటను తక్షణమే కొనాలి

తెలంగాణ రాష్ట్రంలోనిసిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ: తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో […]Read More

Blog

సీఎం అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనుముల రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న అనంతరం  సీఎం రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించాను. తెలంగాణలో మంచి వర్షాలు కురవాలని కోరుకున్నాను.. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం సత్రం, కల్యాణమండపం నిర్మాణానికి కృషిచేస్తాను. దేశ సంపదను పెంచడమే మా ప్రభుత్వ […]Read More

Blog

రైతుకు మద్ధతుగా మాజీ మంత్రి హారీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ (8309981132) అనే రైతు కష్టాలే నిదర్శనం.మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోష్.. సిద్దిపేట జిల్లా గాగులాపూర్ అన్నపూర్ణ రైస్ మిల్లుకు వారి గ్రామం నుండి ఐదు లారీలు వడ్లను పంపారు. పంపి ఐదు రోజులైనా ప్రభుత్వం కొనడం లేదు. అధికారులు జాప్యంతో ధాన్యం మొలకెత్తింది. ఇప్పుడు కొనడం సాధ్యం కాదని […]Read More

Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు..

తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య […]Read More

Slider Telangana

నర్సింగ్ ఆఫీసర్లకు 4నెలలుగా జీతాలివ్వని కాంగ్రెస్ సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలకొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు బ్యాడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రైతన్నలు పండించే సన్నవడ్లకు మాత్రమే ఐదువందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి  మాటల్లో మీరే వినండి.Read More