Tags :cm revanth reddy

Slider Telangana Videos

మంత్రి జూపల్లికి శ్రీధర్ రెడ్డి తండ్రి సవాల్-స్వీకరిస్తారా..?

ఇటీవల హత్యకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అత్యంత దారుణంగా హాత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే శ్రీధర్ రెడ్డి తండ్రి మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు మీద మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా పేరు మీదున్న 30 ఎకరాలు రాసిస్తా.. నిరుపించలేక పోతే జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని బహిరంగ సవాల్ […]Read More

Slider Telangana

BRS ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ధి ముగింపు ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి. జూన్ 1 : జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 […]Read More

Slider Telangana

చిన్నారి సమద్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  హఫీజ్‌పేట్ లోని సాయి నగర్లో వర్షానికి ఓ ఇంటి మూడో అంతస్తులో గాలి వానకు రేకుల షెడ్డు ఎగిరి పోయి ఇటుకలు పడి మూడేళ్ల చిన్నారి సమద్ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి … బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.Read More

Slider Telangana

తెలంగాణలో నకిలీ మద్యంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంలో  నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆరోపించారు బీఆర్ఎస్ యువనేత క్రిషాంక్. మీడియాతో ఆయన మాట్లాడుతూతెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు బుకాయిస్తున్నారు..మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అని సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ఈరోజు తెలిపింది. మంత్రి జూపల్లి అబద్ధం ఆడుతున్నాడా? లేక సీఎం రేవంత్ మంత్రికి తెలియకుండా డీల్ చేస్తున్నాడా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ […]Read More

Slider Telangana

మంత్రి జూపల్లిపై ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు..నిందితులు మీ ఇంట్లోనే ఉంటే ఇంక బాధిత కుటుంబానికి న్యాయం ఏం చేస్తావు.. మేము డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.. మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, వాళ్లు అందరూ జూపల్లి కృష్ణ రావు చెప్పుచేతల్లో ఉన్నారు, వాళ్ల వల్ల మాకు న్యాయం జరగదు.అందుకే ఈ కేసును ఒక స్పెషల్ టీమ్ పెట్టి విచారణ […]Read More

Slider Telangana

అధికార చిహ్నాంపై సీఎం రేవంత్ కసరత్తు-వీడియో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నూతన  అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో  ఈరోజు ఉదయం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా చిహ్నాం గురించి పలు నమూనాలను పరిశీలించారు సీఎం.. అంతేకాకుండా తుది నమూనాపై సూచనలు  సైతం చేశారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు మెరుగులు దిద్దేందుకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించిన విషయం మనందరికి తెలిసిందే.Read More

Slider Telangana

మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి ఉత్తమ్ సవాల్

తెలంగాణ మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.. అసలు సన్నవడ్లు కొనకుండానే వెయ్యి కోట్ల స్కాము ఎలా ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.. దమ్ముంటే నిరూపించాలి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని సన్నవడ్లు పంపిస్తే అన్ని కొంటాము.. డిపాల్ట్ పెట్టిన మిల్లర్లతో కల్సి నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని..నేను అవినీతి అక్రమాలు చేయను అని అన్నారు.Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా రానున్న వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ […]Read More

Movies Slider Telangana

సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ సంగీత దర్శకుల సంఘం ఆగ్రహాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సినీ సంగీత కళాకారుల సంఘం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.. జూన్ రెండో తారీఖున అధికార గీతంగా విడుదల చేయనున్న ‘జయజయహే తెలంగాణ’ పాటకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖ అస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణిని సంగీతం అందించమనడం చారిత్రక తప్పిదమని సీఎం రేవంత్ కు తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ‘మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి కేటీఆర్ పై ఈసీకి పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత..నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉద్ధేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు. కాంగ్రెస్ అభ్యర్థి […]Read More