కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గత పదేండ్లలో కూడా బడ్జెట్ లో ఆశించిన నిధులను కేటాయించలేదు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం మరోసారి అన్యాయం చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ టీడీపీ పాలిత రాష్ట్రాలైన బీహార్ ,ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించడం […]Read More
Tags :central budget
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవకాశాలూ దొరుకుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు..Read More
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. *మందులు, వైద్య పరికరాలు * మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు * సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, * సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం […]Read More
కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More