Tags :BRS

Slider Telangana Top News Of Today

యువతకు పెద్దన్నగా అండగా ఉంటా

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు పెద్దన్నగా అండగా ఉంటాను.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గొల్కోండ కోటలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ” పదేండ్లలో నిరుద్యోగులను, యువతను పట్టించుకోలేదు గత ప్రభుత్వం .. కానీ తాము అలా […]Read More

Slider Telangana Top News Of Today

ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన -బీఅర్ఎస్ మాజీ MLAలు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. భారీ బహిరంగ సభలో పాల్గోనున్న సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం ఆయన బేగంపేట విమానశ్రయం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ ,ఇతర పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగుతాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]Read More

Slider Telangana Top News Of Today

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందజేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో డెబ్బైఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంగా ఉన్న […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్రహాం

తెలంగాణలో ఏడు నెలల  కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు ఎనిమిది […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేకే ఇటీవల గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. దీంతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వచ్చే […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు

తెలంగాణలో త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ట్విస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన బెయిల్ ఫిటిషన్ పై విచారణను మరోవారం రోజుల పాటు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈడీ,సీబీఐ విచారణ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ వివరణను కోరింది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల ఇరవై తారీఖుకు వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ […]Read More

Slider Telangana Top News Of Today

హైకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.Read More