ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే ఆ పార్టీ ఆగిపోయింది. వీటిలో కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఎన్డీయే కూటమికే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును […]Read More
Tags :BJP
ఈరోజు విడుదలవుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 162స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖాయమైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. జూన్ తొమ్మిదో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది.Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 17పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ ఏడు స్థానాల్లో నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్,చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ), సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి జి నగేశ్, మల్కాజిగిరి నుండి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో జహీరాబాద్ నుండి షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, వరంగల్ నుండికావ్య, […]Read More
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి […]Read More
దేశ వ్యాప్తంగా ఈ రోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ […]Read More
తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More
ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More