“అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ […]Read More
Tags :bignews
ఈనెలలో ఎమ్మెల్యేకోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.. ఇందుకుగానూ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఖరారు చేసింది.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్.. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు రావడం విశేషం.Read More
పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550లు పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరగడంతో రూ.87,980 లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొంది.Read More
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?
గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ గెలుపొందారు.Read More
అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక […]Read More
రేవంత్ రెడ్డి కి బిగ్ షాకిచ్చిన అల్లు అర్జున్ మామ ..
ఇటీవల పుష్ప 2 విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటంతో సినీ హీరో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్ధు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ […]Read More
సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సిని మాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిం దంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]Read More
పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ […]Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..Read More
