తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల […]Read More
Tags :big news
దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం కురుస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. దీనిని ప్రస్తావిస్తూ లోక్ సభ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ లో ప్రవేశపెట్టామని తెలిపారు.. వర్షాలకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ […]Read More
ప్రముఖ హాట్ బ్యూటీ..హీరోయిన్ మాళవిక మోహనన్ X వేదికగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ మాళవికను ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగాడు.. దీనికి సమాధానంగా నా వివాహం చూడాలనే తొందర మీకెందుకు? అని ఆమె సున్నితంగా రిప్లై ఇచ్చారు. తంగలాన్ మూవీ లొకేషన్ నుంచి ఫొటో పెట్టమని ఓ వ్యక్తి కోరగా, టాటూ వేయించుకుంటున్న పిక్ షేర్ చేశారు. మేకప్ కోసం రోజూ 4 గంటలు […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ “పదేండ్లు అధికారాన్ని అనుభవించి… పదవులను తీసుకొని కేవలం సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ” ఆరోపించిన సంగతి తెల్సిందే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువనేత కార్తీక్ Xలో స్పందించారు. “దివంగత సీఎం వైఎస్సారు మరణం తర్వాత మా అమ్మపై సీబీఐ కేసులు పెట్టించారు. […]Read More
ఏపీ అధికార టీడీపీ జాతీయ అధ్యక్షులు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పం వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.. వీరికి బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్ లపై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పాలనలో రాష్ట్రానికి బీపీసీఎల్ టో పాటుగా మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అయితే డెబ్భై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు మంత్రిని కోరారు.. దీనికి మంత్రి భరత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానమిస్తూ “‘నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ హైదరాబాద్ నగర పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో పద్దుల గురించి జరిగిన చర్చలో అయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయని ” సంచలన ఆరోపణలు చేశారు. అయన ఇంకా మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక ఏసీపీ ఫోన్ చేసి మా ఏరియాలో పోలీస్ స్టేషన్ను నిర్మించేందుకు నన్ను సాయం చేయమన్నారు. నెల నెల మీరు తీసుకున్న లంచాలతో మీరే సొంతంగా […]Read More