తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More
Tags :anumula revanth reddy
ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ICRISAT సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ (Dr. Jacqueline Hughe) బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి, కొత్త […]Read More
రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది. అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు. దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం […]Read More
తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేసిన రూ.2లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు పలుకారణాలతో కాలేదు. దీంతో రైతులు ఆయాచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్,జగిత్యాల,సిద్దిపేట,ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను […]Read More
హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు […]Read More
రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?. రాష్ట్రంలో ఉన్న […]Read More
తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య షాకిచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంగా సరిత తిరుపతయ్య వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు.. అందులో ఇంచార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గం భీష్మించుకుని కాన్వాయ్ కు ముందు కూర్చున్నారు. దీంతో మంత్రి జూపల్లి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి […]Read More