Tags :annumula revanth reddy

Slider Telangana Top News Of Today

సీతారామ  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో  రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం

ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన […]Read More

Slider Telangana Top News Of Today

రుణమాఫీ కానివారికి అలెర్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More

Slider Telangana Top News Of Today

అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డి

పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికు బయలుదేరి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కి ఆయన  అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మరోవైపు  ఈనెల 14 వరకు  అమెరికాలోని న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. అనంతరం దక్షిణ కొరియాలో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చీఫ్ మినిష్టర్ కాదు చీప్ మినిష్టర్

అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు  అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన […]Read More