టీపీసీసీ చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న నాయకుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు తన్నీరు హారీష్ రావు.. కేటీఆర్.. ఎమ్మెల్యేలందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే అన్ని తానై పార్టీని అధికారం వైపు మళ్లించాడు. అలాంటి నేత అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదు ఇంకా ఎవరూ. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు.. వాళ్ళకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు తప్పదా..?. రాబోయే రోజుల్లో తన తనయుడ్ని సీఎం చేయాలి.. దాదాపు ఓ ఇరవై ఏండ్లు టీడీపీనే అధికారంలో ఉండాలి అని కంటున్న కలలు కలలుగానే మిగలనున్నాయా..?. చంద్రబాబు అంటే వెన్నుపోటు రాజకీయాలని పేరు తరుణంలో అదే బాబుకు సమస్యగా మారనున్నదా ..?. వచ్చే ఎన్నికల్లో బాబుకు పదవీ గండం ఉన్నదా అంటే అవుననే అన్పిస్తుంది ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ తాజా వ్యాఖ్యలు. కాంగ్రెస్ […]Read More
ఇద్దరు MLAలా.?.. 10 మంది MLA లా?- రేవంత్ ముందు పెను సవాల్..!
ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిగా .. ప్రభుత్వాధినేతగా చేసింది ఏమి లేదు. ఒక పక్క ఏడాదిన్నరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు. పైకి మళ్లా పార్టీలో అసంతృప్తులు.. మంత్రివర్గంలో బెర్తు కోసం ఢిల్లీలో పైరవీలు.. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం చేస్తుందని అంతర్యుద్ధం. ఇవన్నీ తలనొప్పిగా మారిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా మరో సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమి చ్చినప్పటికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు […]Read More
మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం, ఆరవ ఫ్లోర్, కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ […]Read More
తెలంగాణ మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పలుదేశాల్లో ఉన్న తెలంగాణ వాదులు.. ప్రజలు.. బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు జరిపారు. రక్తదానం, పేదలకు పండ్లు ఫలాలు పంపిణీ.. అన్నదానం లాంటీ కార్యక్రమాలు ఎన్నో చేశారు. నిన్న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సరూర్ నగర్ – నందనవనం ఎంపీపీ స్కూల్లో పిల్లలకు పండ్లు, సీట్లు పంచారని స్కూల్ ప్రిన్సిపాల్ రజితను సస్పెండ్ చేసిన సంఘటన వెలుగులోకి […]Read More
అధికారులు ఎవరైన సరే మాటవినకపోతే సస్పెండ్ చేస్తానని ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు ఏసీ రూం ల నుండి బయటకు రారు.. ప్రజల సమస్యలను పట్టించుకోరంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద తన ఆగ్రహం వెళ్లగక్కారు. తాజాగా ఆయన మరో అడుగు […]Read More
సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటు న్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ […]Read More
తెలంగాణ సీఎంఓ అడ్డాగా మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీలకు బెదిరింపులు
ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే ప్రతి సంవత్సరం దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం సమకూరుతుంది.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్ను లిక్కర్ కంపెనీల మీద పడింది. ఇంత పెద్ద లిక్కర్ ఇండస్ట్రీ నుండి ఎంతో కొంత లాభాన్ని కొట్టేయాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో లిక్కర్ వ్యాపారం చేసే మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమీషనర్ చేస్తున్న అరాచకంపై మెట్టుగూడ డివిజన్ బీఆర్ఎస్ కార్పోరేటర్ రసూరి సునీత ప్రశ్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని మెట్టుగూడ డివిజన్ పరిధిలో పేదల షాపులపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. . మెట్టుగూడ మార్కెట్ లో పేదల షాపుల స్థలాలను దౌర్జన్యంగా డిప్యూటీ కమిషనర్ ఖాళీ చేయిస్తున్న విషయం తెలుసుకున్న […]Read More