Month: February 2025

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్ గా కోహ్లి(158) రికార్డు సృష్టించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో  రెండు క్యాచ్లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్ గా అత్యధిక క్యాచ్ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే(218), ఆసీస్ మాజీ కెప్టెన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ మరో మైలురాయి..?

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే క్రికెటులో మరో మైలురాయిని చేరుకున్నారు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా (287 ఇన్నింగ్సులు) 14వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్సులు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 378 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా  14వేల పరుగులు పూర్తి చేసిన మూడో ప్లేయర్ కింగ్ కావడం గమనార్హం. కోహ్లి కన్నా ముందు సచిన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కుల్దీప్ యాదవ్ 300… హార్థిక్ 200..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్,హార్థిక్ పాండ్యా చరిత్రకెక్కారు.. తాజాగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ యాదవ్ 300, హార్థిక్ పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 176 వికెట్లు, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీశాడు.. మరోవైపు హార్థిక్ పాండ్య టీ20ల్లో 94, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా లక్ష్యం 242..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టుతో  మ్యాచులో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ లో షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీశారు.. మరోవైపు అక్షర్, జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 50 ఓవర్లలో 242 రన్స్ చేయాలి. ప్రస్తుతం ఒక వికెట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..?

దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో   ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రీది వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ ను  ఆడలేక రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యారు. షహీన్ అఫ్రిదీ ఓ అద్భుతమైన బంతి వేశారు.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 3 ఫోర్లు, ఒక సిక్సుతో హిట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి..!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేదపండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి సీఎం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్..!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై లొక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంబంధిత అధికారులను ఘటనా స్థలానికి పంపించామని తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రక్షణ శాఖ సిబ్బంది, హైడ్రా ప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి వివరించారు. ప్రమాదంలో […]Read More

Andhra Pradesh Breaking News Hyderabad Slider Top News Of Today

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణీ నారా భువనేశ్వరి జీహెచ్ఎంసీకి రూ.5.50కోట్ల పన్నులను ఎగవేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఆస్తి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పన్ను కట్టలేదని గుర్తించింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆస్తి పన్ను రూ.5.5 కోట్లు బకాయిలు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు‌ జారీ చేసింది. మరోవైపు ఇప్పటికేబల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలను జీహెచ్ఎంసీ అధికారులు […]Read More