Month: December 2024

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబు కిచ్చే మంత్రిత్వ శాఖ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ప్రస్తుతం […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

రాత్రి పూట 9 తర్వాత తింటున్నారా..?

ప్రస్తుత బిజీ లైఫ్ రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు పై కేసు నమోదు..!

ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి గురించి మోహాన్ బాబు పై  118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు.. రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసాపై కీలక నిర్ణయం..!

గత సార్వత్రిక ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమల్లో భాగంగా రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో  ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుంది.. 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ […]Read More

Breaking News Sports Telangana Top News Of Today

ఆశా వర్కర్లపై ప్రభుత్వ ప్రేరేపిత దమనకాండ దారుణం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలం అవ్వడమే కాకుండా ఏడాదికాలంగా తన వద్దనే పెట్టుకున్న హోంశాఖ విద్యాశాఖ పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు విషయమై ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి రాజధానికి తరలివచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులతో దారుణంగా దాడి చేయించడం, పలువురు ఆశా వర్కర్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దిలావర్‌పూర్‌లో 122 మంది రైతులపై కేసు

తెలంగాణలోని నిర్మల్ – దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని పేర్కొంటూ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాలకు చెందిన ఐదువేల కుటుంబాల రైతులు కుటంబ సభ్యులతో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనలు విరమించారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపగా పరిశ్రమను రద్దు చేయడంతోపాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు […]Read More

Breaking News National Slider Top News Of Today

మాజీ సీఎం కన్నుమూత..!

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎంగా పని చేశారు.. ఆ తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఆయన పనిచేశారు.Read More