Month: July 2024

Slider Telangana

కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.Read More

Andhra Pradesh Slider

ఈ నెల 22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Slider Telangana

ఈ నెల 23 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More

Andhra Pradesh Slider

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో […]Read More

Slider Telangana

బ్యాంకింగ్ లోనే కనీవినని చరిత్ర

దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్ చరిత్రలోనే కనీవినని విధంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.. రుణమాఫీకి అర్హులైన ముప్పై రెండు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధితాధికారులు ప్రజాభవన్ లో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల్లోపు పదకొండు లక్షల మంది రైతులకు సంబంధించిన లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయి..ఇందుకు […]Read More

Crime News Sports

రీల్స్ చేస్తూ లోయలో పడి యువతి…?

ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది.. కాగా అన్వీకి సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.ఈమధ్య ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృత్తం అవుతున్న జాగ్రత్తపడకపోవడం చాలా […]Read More

Slider Telangana

ఎలుకలకు నిలయంగా గురుకులాలు

తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ హాస్టళ్లన్నీ ఎలుకలకు నిలయమవుతున్నాయా..?..హైదరాబాద్ మహానగరంలోనే సాక్షాత్తు జెన్టీయూ లాంటి హస్టళ్లలో పిల్లులు,ఎలుకలు ఉండగా గురుకులాల్లో ఉండవా అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎలుకలు విద్యార్థులను గాయపరిచిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హనుమకొండ – హసన్‌పర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ హాస్టల్ గదుల్లో ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉంది.. రాత్రి  పడుకున్న సమయంలో ముగ్గురు విద్యార్థులను ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వారిని హసన్‌పర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. […]Read More

Slider Telangana

బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టీ సూచనలు

రైతు రుణమాఫీ ప్రక్రియ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో భట్టీ మాట్లాడుతూ రుణమాఫీ నిధులను బకాయిలను రద్ధు చేయడానికి మాత్రమే వినియోగించాలి. ఈ నిధులను వేరే రుణాలకు మల్లించవద్దు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పదకొండు లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల […]Read More

Slider Telangana Top News Of Today

మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి…వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు … ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు.. ఈరోజు మధ్యాహ్నాం మూడు గంటలకు జగన్ బెంగుళూరు నుండి ఆంధ్రాకి రానున్నారు. తాడేపల్లిగూడెం కు చేరుకుని అక్కడ నుండి వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు.. వినుకొండ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురైన సంగతి తెల్సిందే..దీంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకుని వస్తున్నారని వైసీపీ […]Read More