ఐటీ రంగంలో ఉద్యోగార్థులకు శుభవార్త. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది ఎక్కువమందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2024-25 ఏడాదిగానూ 15000 నుండి 20000 ల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ లను నియమించుకోనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.. గతేడాది ఇన్ఫోసిస్ దాదాపు యాబై వేల మందిని నియమించుకుంది… ఆ తర్వాత ఏడాది మాత్రం కేవలం 2023-24లో 11900ల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ లను మాత్రమే నియమించుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య […]Read More
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More
వినుకొండకు బయలుదేరిన మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాన్వాయ్ పై పోలీసులు అంక్షలు విధిస్తున్నారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి భారీ కాన్వాయ్ గా బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ను వినుకొండకు సరిహద్దుప్రాంతంలో పోలీసులు ఆపారు.. జగన్ తో పాటు వచ్చిన మాజీ మంత్రుల..ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల..మాజీ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల …ఎంపీ.మాజీ ఎంపీల కాన్వాయ్ ను అక్కడ ఆపేశారు. కేవలం జగన్ కాన్వాయ్ ను మాత్రమే లోపలకు పంపించి […]Read More
రెండు రోజుల క్రితం హత్యకు గురైన వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్షించడానికి వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి బయలుదేరి వెళ్లారు.. ఈక్రమంలో వినుకొండలోని రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడనున్నారు..అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు..Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరొకసారి ఢిల్లీకి వెళ్లానున్నారు. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పదిలక్షల మందితో కృతఙ్ఞత సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీకి రేపు పయనం కానున్నారు. లక్ష లోపు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఓ జిల్లా కలెక్టర్ పాలాభిషేకం చేసిన సంఘటన వివాదాస్పదం అవుతుంది.. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. నిన్న గురువారం రుణమాఫీ సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతువేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు… సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.కలెక్టర్ హోదాలో ఉండి రాజకీయ […]Read More
గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము.. అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29 వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. ఆరోగ్య శ్రీ, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు లాంటి ఐదు గ్యారంటీలను అమలు చేశాము అని సీఎం రేవంత్ […]Read More
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలి…. ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని […]Read More
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. 🔹డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. […]Read More
తెలంగాణ వ్యాప్తంగా లక్ష లోపు ఉన్న రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల యాబై వేల మందికి చెందిన రైతు రుణాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదే మంచి తరుణం అని భావించి సైబర్ నేరగాళ్లు తమ చేతికి పని చెప్పారు. రైతులకు APK లింకులను పంపి ఆ సొమ్మును కాజేయాలని వ్యూహాలు […]Read More