Month: June 2024

Editorial Slider Telangana Top News Of Today

KCR ఎందుకు బయటకు రావడంలేదు..?

KCR ఈ మూడక్షరాల పేరు విన్న పలికిన వచ్చే గూస్ బమ్స్ వేరే లెవల్ అని గులాబీ శ్రేణులు..ఆయన అభిమానులు చెప్పే మాట.. తింటే గారెలే తినాలి..వింటే చూస్తే కేసీఆర్ ప్రెస్మీట్ నే చూడాలి..ఆయన మాటలు వినాలి అని అంటుంటారు.. ఇక ఉద్యమ సమయంలోనైతే ఆయన ప్రసంగం.పంచ్ లు మాటలు తూటాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాయి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం స్థానంలో ఉండి కూడా మాటల్లో  కానీ చేతల్లో కానీ  ఆ […]Read More

Slider Telangana Top News Of Today

BRS MLA VS మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ ను  హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరిస్తూ ఈరోజు ఉదయం  హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తానని అన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే..కేవలం ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు […]Read More

Crime News Slider

ఇంటర్ ఫెయిల్-విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ – కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నానగర్‌కి చెందిన రిషిక(18) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. నిన్న సోమవారం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా మళ్లీ ఒక పరీక్షలో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.Read More

Editorial Slider Telangana Top News Of Today

రాజకీయ చదరంగంలో చెరగని తప్పులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు  కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ […]Read More

Slider Telangana Top News Of Today

పాలనలో అనుభవరాహిత్యం-తెలంగాణలో బదిలీల బంతాట

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  చేస్తున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీల గురించి విశ్లేషకులు పాలనలో రేవంత్ అనుభవరాహిత్యంతో పాటు అధికారులకు తలనొప్పులు, ప్రజలకు తిప్పలు!తెలంగాణలో ప్రస్తుత బదిలీలు బంతాటలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.. ఎప్పుడుంటామో, ఎప్పుడు ఊడుతామో తెలియక పనుల మీద అధికారులు  సీరియస్ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో  పాలన పడకేసి, రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.. దీనికి కొన్ని ఊదాహరణలు ఊదాహరిస్తున్నారు.. 1) ఐపీఎస్‌ అధికారి ఏవీ […]Read More

Bhakti Slider Top News Of Today

అయోధ్య రామ మందిరం పై కప్పు నుండి వాటర్ లీక్

శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన వర్షం కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.. సీజన్లో తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు రావడం.. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడం, ప్రధాన పూజారి గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి, ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను బీజేపీ ‘అవినీతిహబ్’గా […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత పడేండ్లుగా చేతినిండా పనులతో కళ కళ లాడిన చేనేత రంగం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సంక్షోభం లో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో నేతన్నల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఉపాధి లేక ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికుకులు […]Read More

Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు తుమ్మల కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డి గురించి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అని అన్నారు. సంక్షేమం అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. అర్హులైన పేదలందరికి సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అందుతాయి. రుణమాఫీ, రైతుభరోసా అమలుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై […]Read More

Slider Sports Top News Of Today

సెమీస్ కు భారత్

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More

Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో సీఎం రేవంత్ భేటీ

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,500 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని ముఖ్య‌మంత్రి రేవంత్ అనుముల గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి గారిని క‌లిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని సీఎం గారు ర‌క్ష‌ణ […]Read More