Month: June 2024

Crime News Slider Telangana

ఇద్దరితో రోమాన్స్.!.కన్నతండ్రినే..?

ఫాదర్స్‌ డే నాడే దారుణమైన విషయం ఒకటి  వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రియులతో రొమాన్స్‌కు అలవాటు పడిన ఓ యువతి.. తనకు అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రినే హత్య చేసింది.ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ దారుణమైన సంఘటన  చోటుచేసుకుంది. చివరకి దొరికిపోవడంతో కన్నతండ్రే తనపై లైంగికవేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక చంపేశానని అభాండం మోపింది. ఆమె మాటలు నమ్మకుండా పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది.Read More

Andhra Pradesh Slider

ముస్లీం సోదరులకు బాబు బక్రీద్ శుభాకాంక్షలు

ఏపీలో ఉన్న ముస్లీం సోదరులకు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. రేపు బక్రీద్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని  అన్నారు. “అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన  సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు  పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More

Andhra Pradesh Slider

పోలవరం సందర్శనకు చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లనున్నారు.. ఇందులో భాగంగా రేపు  ఉదయం 11.45 గంటలకు పోలవరం చేరుకుంటారు.. దాదాపు మధ్యాహ్నాం  1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో బాబు  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై […]Read More

Movies Slider

పెళ్లికి అందుకే దూరం -సదా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ  ఇంతవరకూ నా హృదయానికి  దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More

Slider Telangana

బీసీ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More

Andhra Pradesh Slider

వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More

Slider Telangana

కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత బక్రీద్ సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.అందులో భాగంగా త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునేది బక్రీద్ . దైవాజ్ఞ ను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన అన్నారు.Read More

Slider Telangana

సీఎం రేవంత్ కి మోడీ బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న సింగరేణి బ్లాకులల్లో ఆరు బ్లాకులను ఈ నెల చివరాఖరి వరకు వేలం వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేస్తామని హుకుం జారీ చేసింది. మరోవైపు గత తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క బ్లాకు […]Read More