90-100 సీట్లు ఖాయమంటున్న టీపీసీసీ చీఫ్..!

TPCC chief says 90-100 seats are certain..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ మాట్లాడుతూ ” మాది రైతు ప్రభుత్వం. మాది ప్రజాపాలన.
రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. రైతులు పండించిన సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాము. నిజామాబాద్ లో కొత్త షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాము. పదేండ్ల పాలనలో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలి.
కేసీఆర్.. కేటీఆర్ దోచుకోవడం. దాచుకోవడం తప్పా తెలంగాణ ప్రజలకు.. నిజమాబాద్ ప్రజలకు చేసింది ఏమి లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో మాకు 90-100 సీట్లు రావడం ఖాయం. మాదే మళ్లీ అధికారం అని ఆయన అన్నారు.
