రేవంత్ రెడ్డికి షాకిచ్చిన సీనియర్ ఎంపీ…!

anumula revanth reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. అఖరికీ ఎంపీల నుండి సైతం మద్ధతు లేదని పలు మార్లు పార్టీ మీటింగ్స్ లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన హెచ్ సీయూ వివాదంలో సైతం మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు మద్ధతూ ఇస్తూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పడేస్తున్నారు .
తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత. ఎంపీ అయిన డా. మల్లు రవి గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” హెచ్ సీయూ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వంద ఎకరాల్లో అడవులను పునరుద్ధరిస్తాము. ఆ నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది.
అందులో ఐటీ పార్కులను నిర్మిస్తాము. యువతకు ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడులను పరిశ్రమలను ఆహ్వానిస్తాము. ఎవరి మాట వినము అని వ్యాఖ్యానించారు. ఒకవైపే ఏమో సుప్రీం కోర్టు ఆ నాలుగోందల ఎకరాల్లో ఎలాంటి పనులు చేయద్దని ఆదేశాలను జారీ చేస్తాను. కోర్టులను లెక్కచేయకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆ నాలుగోందలఎకరాలను లాక్కుంటాము అని చెబుతుంటారు. ఇదేన ప్రజాపాలన.. ప్రజాపాలనలో ప్రజలను దోచుకుంటారా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
