బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్ …?

 బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్ …?

Big shock on BRS silver jubilee…?

Loading

ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను రజతోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ నేతలు అందుకుతగ్గట్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే సభాస్థలిని సిద్ధం చేయడమే కాకుండా సభ ప్రాంగాణంలో హాజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ వేడుకలు జరగనున్న తరుణంలో గులాబీ శ్రేణులను డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం ఘటనలో మాజీ సీఎం కేసీఆర్.. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమీషన్ యోచిస్తున్నట్లు టాక్.

అందుగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో వార్తలు విన్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే పథకాల అమలను పక్కతోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న అధికార పార్టీ తాజాగా గులాబీ పండుగనుండి ప్రజల దృష్టిని మరల్చడానికి తెరతీసినట్లు ఆ వార్తల సారాంశం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *