అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!

టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు ఏమి మాట్లాడిన.. చేసిన అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రశ్నించేది. ప్రజల తరపున పోరాడేది.ఇది ఎవరూ కాదనని నగ్నసత్యం. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. అధికారుల గురించి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెబితే అది వెనక ముందు ఆలోచించకుండా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకూ.. పంచాయితీ కార్యదర్శి నుండి సీఎస్ వరకూ అందరూ తలలూపుతున్నారు.
తాజాగా రాష్ట్ర రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాలను కదిలించిన హెచ్ సీయూ వివాదం గురించి మనందరికీ తెల్సిందే. ఈ వివాదంలో సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి నుండి సీఎస్ వరకూ అందర్నీ తలంటింది. అవసరమైతే అదే భూముల్లో తాత్కాలిక జైలుని నిర్మించి జైళ్లో పెడతామని వార్నింగ్ సైతం ఇచ్చిందంటే అధికారులు తమ పరిధిని దాటడమే కాదు చట్టాన్ని సైతం ఎంతగా అతిక్రమిస్తున్నారో ఆర్ధమవుతుంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ అధికారులు జాగ్రత్త.. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటది. రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉంటది.
అధికారులు మీరు శాశ్వతం. మీరు తప్పులు చేయద్దు. ఆగం కావోద్దు అనే ఆలోచనతో సలహా ఇవ్వడం బాగుంది. ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అధికారులు వాళ్ళు.. రాజకీయ నేతలు కాదు. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో వాళ్లకు తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు చెప్పినట్లు కొంతమంది అధికారులు నడుస్తారు. ఆ అధికారుల వల్లనే అందరికీ చెడ్డపేరు. ఇది మీకు తెల్సు. ఇవాళ ఈ పార్టీకి వంతు పాడినోళ్ళు రేపు మీరు అధికారంలోకి వస్తే మీకు పాడతారు.
ఈ లాజిక్ మీకు తెల్వంది కాదు. అయిన మీరు ఇలా ఆలోచనలేకుండా మాట్లాడితే మీకు ఇంకా అహాంకారం తగ్గలేదు. అధికారంలోకి వస్తారని మీకు అంతా ధీమా ఎందుకు ఉంది. మీరే నిర్ణయించుకుంటారా అని అధికార పక్షం దాడులు చేస్తాదని హెచ్చారిస్తున్నారు. ఓవరాల్ గా మారాల్సింది అధికారులు కాదు రాజకీయ నేతలు.. అధికార పార్టీ శాశ్వతం కాదు..ప్రభుత్వాధికారులు అని వారు హుతబోధ కూడా చేస్తున్నారు. ఏది ఏమైన కొంతమంది అధికారులు ఓ వర్గానికో.. ఓ పార్టీకో తలోగ్గి పని చేయడం తప్పు.. చట్టం అతిక్రమించి చేయడం నేరం.
