రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో షాకింగ్ ట్విస్ట్ …!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.
కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గోన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకే ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయి.
నెలకు మూడు నుండి నాలుగు వేల కోట్ల రూపాయలను జీతాలు ఇవ్వాల్సి ఉంది. దేశంలో అప్పులు పుట్టడం లేదు. కేంద్రం సహాకరించడం లేదని వ్యాఖ్యానించిన వీడియోలను అధికార బీఆర్ఎస్ వైరల్ చేస్తూ ఇటు కేంద్రం అప్పు ఇవ్వడం లేదని.. దేశంలో అప్పులు పుట్టడం లేదని జపాన్ వెళ్లి అప్పులను అడగటానికి వెళ్లారంటూ ఆరోపిస్తున్నారు.
