కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

 కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు.

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన మాజీమంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, MLC ఎగ్గే మల్లేశం, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులున్నారు.

శంకర్ యాదవ్ తల్లి లలితా బాయ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *