మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు ఎందుకు…?

 మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు ఎందుకు…?

Former Minister KTR’s key decision..!

Loading

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణకు హెచ్ఎండీఏ నుండి క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా యాబై రెండుకోట్ల రూపాయలను ఓ ప్రవేట్ విదేశీ కంపెనీకి తరలించారనే కారణంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పజెప్పింది.

ఈ కేసు ఎందుకు కేటీఆర్ పై పెట్టారంటే పలువురు పలు విశ్లేషణలు చేస్తున్నారు. మంత్రిగా ఉండి అప్పటి క్యాబినెట్ అనుమతి లేకపోవడం.. ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం లాంటి కారణాలతో నిధులను దుర్వినియోగపరిచారనే అభియోగంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఓ మంత్రిగా రాష్ట్రంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలనే ఇలా చేశారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రిగా సర్వాధికారాలను ఉపయోగించి మంచి పనికే చేశారు. తమ జేబుల్లో నింపుకోవడానికి కాదుగా అని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో..!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *