ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

 ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

2 total views , 1 views today

సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు.

ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.

ఎన్నికల ముందు అమలుకాని హామీలతో ప్రజలను మోసగించి , అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ,
అటువంటి పార్టీని శాసన మండలిలో నిలదీయాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి
దీవించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టభద్రుల ఓటర్లకు సత్తుపల్లిలోని సండ్ర వెంకటవీరయ్య గారి ఆధ్వర్యంలో ఎం.ఆర్ గార్డెన్, లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థి, ప్రభుత్వ, ప్రయివేటు, ఉద్యోగులు తదితర పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరై బి.ఆర్.యస్ పార్టీకి మద్దతు పలికారు. ఉద్యోగులు , నిరుద్యోగులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.రాకేష్ రెడ్డి ని గెలిపించడం ద్వారా మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ కళ్లు తెరిపించాలని అన్నారు .నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, రెండు లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని అన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ను ఎన్నికల్లో తరిమికొట్టాలని అన్నారు రాకేష్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేస్తారని చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400