రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?

Revant government’s big shock for Asara beneficiaries..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” అని అన్నారు..
ఆయన ఇంకా మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చాక డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ మాట తప్పావు. నెల నెల నాలుగు వేలు ఆసరా ఫించన్ ఇస్తా అని మాట తప్పావు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తా అని మాట తప్పావు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నరవేలు ఇస్తానని మాట తప్పావు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టభద్రత అని మాట తప్పావు. నువ్వు చెప్పిన ఏ మాటపై నిలబడ్డావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
టీచర్ బదిలీలు పద్దెనిమిదేండ్ల తర్వాత చేశాము అని చెబుతున్నావు.. మేము రెండో సారి అధికారంలోకి వచ్చాక 2018లో టీచర్ బదిలీలు చేశామన్న సంగతి మరిచిపోయావా..?. మేము వచ్చాక సర్కారు బడుల్లో కరెంటిచ్చామంటున్నావు.. మీరు ఇవ్వకముందే మేమిచ్చాము. రెండు లక్షల రుణమాఫీ కాలేదు .. అయిందని అంటున్నావు. బీఆర్ఎస్ హాయాంలో మంజూరైన రీజనల్ రింగ్ రోడ్డు నేను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందని చెబుతున్నావు.. ఈ ఒక్కరోజే పది అబద్ధాలు చెప్పావు.. నిజంగా అబద్ధానికి రూపమే ఉంటే నువ్వు ఆడిన అబద్ధాలను చూసి హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోతుంది అని హేద్దేవా చేశారు.
