తెలంగాణకు పవన్ కళ్యాణ్ విరాళం

Pawan Kalyan Deputy CM Of Ap
ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్.
తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు.
కష్టాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరూ అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు సైతం ఇరు రాష్ట్రాలకు తమకు తోచినంత సాయం చేయాలని పవన్ ఈ సందర్భంగా కోరారు. మరోవైపు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల.. ఎమ్మెల్సీ.. ఎంపీల ఒక నెల వేతనాన్ని వరద బాధితుల కోసం ఇస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఇప్పటికే ప్రకటించారు.