ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

 ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది.

ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *