రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Big shock for former minister KTR..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు.
హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. అందుకే హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదు.. హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా మావాళ్ళే.. మాకు ప్రాంతీయతత్వం లేదు.. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డనే.. ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ మాటలను కూడా ప్రజలంతా ఆలోచించుకోవాలి.. మేము ఎంతోమంది సీఎంలను చూశాము కానీ రేవంత్ రెడ్డిలాంటి సీఎం ను చూడలేదు అని ఆయన అన్నారు.