ఆ ఎమ్మెల్యే అంటే అంతే…?

తాము చేసిన పనికి పైసలు రావడం లేదు. ఒక నెల కాదు.. రెండు నెలలు కాదు. ఏకంగా ఏడాది అవుతుంది. తమకు జీతాలు రాక. కొద్దిగా కనికరించండి మేడమ్ అంటూ ఎమ్మెల్యేను వేడుకున్న గ్రామపంచాయితీ ఉద్యోగులను విధుల నుండి తప్పించడమే కాదు ఏకంగా సస్పెండ్ చేశారు .
ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంం చెర్లపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. మొన్న బుధవారం చర్లపాలెం పాఠశాలలో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామ పంచాయితీలో పని చేసే సిబ్బంది ధర్మారపు వెంకటమ్మ , జయమ్మ ,చింతకుంట్ల సత్తయ్య, చిట్టిమల్ల సాయిలు, ధర్మారపు మల్లమ్మ కల్సి తమ సమస్యను వివరించి గోడును చెప్పుకున్నారు.
దీంతో ఆ ఐదుగుర్ని గురువారం నుండి విధులకు రావోద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఆ ఎమ్మెల్యే అంతే తనకు చెడు చెప్పకూడదు. కష్టాలు చెప్పుకోకూడదు. జీతాలు రావడం లేదని చెప్పుకుంటే జీవితమే లేకుండా చేస్తారా అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు సదరు ఎమ్మెల్యేపై.
