రేవంంత్ రెడ్డి చేయలేనిది హేమంత్ సోరెన్ చేసిండు..!

జార్ఖండ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జేఎంఎం చీఫ్ .. హేమంత్ సోరెన్ 2024 డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం “మాయీ సమ్మాన్” పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.
మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతుంది. ఇప్పటివరకు గత ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు రెండున్నర వేలు ఇచ్చే హామీ మహాలక్ష్మి..
ఏడాది అవుతున్న ఎందుకు మహిళలకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతినెల ₹2500 ఇస్తామని చెప్పిన మొట్టమొదటి హామీకే దిక్కులేకుండా పోయింది అంటూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు హేమంత్ సోరెన్ ప్రకటన ఇచ్చిన యాడ్ ను తన ట్విట్టర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
