సుప్రీం కోర్టును అవమానించిన బండి సంజయ్

 సుప్రీం కోర్టును అవమానించిన బండి సంజయ్

Bandi Sanjay Kumar

Loading

కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే.

ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు కేటీఆర్ కౌంటరిస్తూ ” భాధ్యతాయుతమైన హోం శాఖ సహాయక మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తీర్పును అవమానిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఇయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నాను” అని ట్వీట్ చేశాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *