మాజీ మంత్రి హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి

 మాజీ మంత్రి హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి

Former Minister Harish Rao

Loading

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు బ్యానర్లు,ఫ్లెక్సీలు ఇటు హైదరాబాద్ లో అటు సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశారు.

వీటిని తొలగించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు.. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని స్థానిక పీఎస్ కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఆర్ధరాత్రి సిద్దిపేటలో ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు.ఈ దాడిలో అక్కడ ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు చెందిన ఫ్లేక్సీలు,హోర్డింగ్ లు చింపేశారు. అంతేకాకుండా ఆర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు వీరంగం సృష్టించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *