హరీశ్ రావుకు దామోదర రాజనరసింహ కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు.
వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు.
అందులో మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కల్పించాలి. జీవోలు ఇచ్చేసి భవంతులు కడితే అవి మెడికల్ కాలేజీలు అయిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. హరీశ్ హయాంలో మెడికల్ కాలేజీలు అన్ని పేపర్లకే పరిమితమయ్యాయి.
మా ప్రభుత్వం వచ్చాక వాటిలో మౌలిక సదుపాయాలు, అన్ని వసతులు కల్పిస్తున్నాము. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీని విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాము. ఒక్క మెడికల్ సీటు వృధా కాకుండా తీసుకునే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.