ఇడియట్ అంటూ ఎమ్మార్వోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అగ్రహాం..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే … ప్రభుత్వ విప్ రాంచంద్రూ నాయక్ రెవిన్యూ అధికారులపై నోరు పారేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం, మరిపెడలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను. విప్ ను.. మెజిస్ట్రేట్ ను.. నాదీ కలెక్టర్ ర్యాంకే. ఇసుక రవాణాకు టోకెన్ సిస్టమ్ పెట్టి ఎందుకు రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ సమయంలో సస్పెండ్ కాకుండా చూస్కోండి.
రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుకను దొంగల పాలు చేస్తున్నారు. ఇడీయట్.. మాటలు చెప్పకుండా రెవిన్యూ ,పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో పని చేయండి. నియోజకవర్గంలో అధికారులు ఎవరూ నా మాట వినడం లేదు. నా పదవి ఇప్పుడే అయిపోదు. మీకు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వెళ్లి వ్యాపారాలు చేస్కోండి అంటూ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
