అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

revanth reddy anumula

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆ నివేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు జూపల్లి, పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులకు కౌంటరిచ్చారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణను దోచుకున్నారనే కదా కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కేవలం దుర్బుద్ధితోనే నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల, ఇంజనీర్ల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టును రీడిజైన్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని ఆయన నియమించారు.

ఆ నివేదిక వారికి అనుకూలంగా లేదని దాన్ని తొక్కిపెట్టి వాళ్లనుకున్న చోట ప్రాజెక్టును కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణను తెచ్చుకుంది. ఏనుగులను తినేవాళ్ళు పోయారనుకుంటే పీనుగులను తినేవాళ్లు వచ్చారు” అని తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *