కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెల్సిందే.
ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు.
సర్వేకు వచ్చిన కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు
